బంగారం ధర మరోసారి స్వ‌ల్పంగా పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, స్టాక్ మార్కెట్ ఒడుదుడుకుల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగిపోయాయి. నేడు బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..! 

బంగారం ధర మన దేశంలో మ‌రోసారి స్వ‌ల్పంగా పెరిగింది. సోమ‌వారం దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో స్వ‌ల్ప‌ పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా సోమ‌వారం (మార్చి 14, 2022) బంగారం ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ముఖ్యంగా పసిడి ధర రోజురోజుకూ పరుగెడుతోంది. 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,810గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,400గా ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,810 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810గా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,810గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొనసాగుతోంది. 

వెండి ధరలు

వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధ‌ర‌ రూ.70,300 ఉండగా, ఆర్థిక రాజ‌ధాని ముంబైలో రూ.74,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.74,700 ఉండగా, కోల్‌కతాలో రూ.70,300గా ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.74,700 ఉండగా, కేరళలో రూ.74,700గా ఉంది. 

తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లో కూడా వెండి ధరలో నిల‌క‌డ కనిపించింది. హైద‌రాబాద్‌లో కిలో వెండి రూ. 74,700 వద్ద కొనసాగుతోంది. విజ‌య‌వాడలో కిలో వెండి రూ. 74,700గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర‌ కొనసాగుతోంది.