బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతుంటాయి. వాస్తవానికి పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతుంటాయి. వాస్తవానికి పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి ప్రధానంగా బంగారం, వెండిల‌పై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి (ఫిబ్ర‌వ‌రి 22, 2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వివిధ న‌గ‌రాల్లో నేటి బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.51,570 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 వద్ద కొనసాగుతోంది.

ఇక‌పోతే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050గా ఉంది.

వెండి ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధ‌ర‌ రూ. 64,400కు చేరింది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,400కు చేరింది. వెస్ట్ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో కిలో వెండి ధ‌ర రూ. 64,400కు చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి రూ. 69,100 కాగా.. బెంగుళూరులో కిలో వెండి రూ. 70,000 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‏లో కిలో వెండి ధర రూ. 70,000 దగ్గర కొనసాగుతుంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 700 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేట్ రూ. 70,000 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 700గా ఉంది.