ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.89 , ముంబైలో లీటరుకు రూ .112.78 గరిష్ట స్థాయికి పెరిగింది. ముంబైలో, డీజిల్ ధర లీటరుకు రూ. 103.63 కి చేరుకుంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ దీని ధర రూ .95.62.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇంధన రేట్లు మళ్లీ లీటరుకు 35 పైసలు పెరిగాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.89 , ముంబైలో లీటరుకు రూ .112.78 గరిష్ట స్థాయికి పెరిగింది. ముంబైలో, డీజిల్ ధర లీటరుకు రూ. 103.63 కి చేరుకుంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ దీని ధర రూ .95.62.
కోల్కతాలో, పెట్రోల్ లీటరుకు రూ. 107.45 కి అమ్ముతుండగా, డీజిల్ లీటరుకు రూ .98.73 కి విక్రయిస్తున్నారు. అదే సమయంలో, చెన్నైలో పెట్రోల్ రూ. 103.92 కి విక్రయించబడుతుండగా, డీజిల్ లీటరుకు రూ. 99.92 అమ్ముతున్నారు.
diesel prices భారీగా పెరుగుతుండడంతో, ఇంధనం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో లీటర్ రూ .100 కి పైగా అందుబాటులో ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యత్యాసం కనిపిస్తున్న పెట్రలో ధర.. కొన్ని నెలల క్రితమే లీటరుకు రూ.100 దాటిన సంగతి తెలిసిందే.
అయితే, సెప్టెంబర్ 5 నుండి పెట్రోల్ ధరలు స్థిరత్వాన్ని కొనసాగించాయి, కాగా, చమురు కంపెనీలు గత వారం pump pricesను పెంచాయి. OMC లు ధరలలో సవరణ చేయడానికి ముందు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు పరిస్థితిపై తమ వాచ్ ధరలను maintainచేయడానికి ప్రాధాన్యతనిచ్చాయి.
గత మూడు వారాలుగా పెట్రోల్ ధరలను సవరించకపోవడానికి ఇదే కారణం. కానీ ప్రపంచవ్యాప్తంగా oil price movementలో విపరీతమైన అస్థిరత ఇప్పుడు OMC లను ఇలా ధరలు పెరుగేలా ప్రభావితం చేసింది.
duty cut లేకుండా, auto fuels నుండి ప్రభుత్వం రూ. 4.3 లక్షల కోట్లకు పైగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు ఇది బడ్జెట్ అంచనా అయిన రూ. 3.2 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ. FY21 లో కూడా, ఖజానాకు పెట్రోలియం రంగం యొక్క సహకారం రూ .4 లక్షల కోట్లకు పైగానే ఉంది.
జెట్ ప్లేన్స్ ఇంధన ధరలను మించిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకి ఎంతంటే ?
ఎందుకంటే మార్చి 2020, మే 2020 మధ్య petrol and dieselపై ఎక్సైజ్ సుంకం రూ .13, రూ .16 పెంచారు. ఇప్పుడు డీజిల్ పై రూ .31.8 పెరగగా, పెట్రోల్ పై రూ .32.9 కి పెరిగింది.
జెట్ ప్లేన్స్ ఇంధన ధరలకంటే ఎక్కువగా...
కాగా, మూడు రోజుల క్రితమే వరుస నాలుగు రోజుల పెంపు తర్వాత అక్టోబర్ 18న పెట్రోల్ (petrol), డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు స్థిరంగా ఉంచాయి. ధరల సవరణ లేనప్పటికి పెట్రోల్, డీజిల్ (diesel)ధరలు ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరాయి. ఇంధన ధరలు చివరగా లీటరుకు 35 పైసలు పెరిగింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.84, ముంబైలో లీటరుకు రూ. 111.77 గరిష్ట స్థాయికి పెరిగింది.
ముంబైలో డీజిల్ ఇప్పుడు లీటరుకు రూ. 102.52 కి చేరగా, ఢిల్లీలో ధర రూ.94.57గా ఉంది. అయితే అక్టోబర్ 12, 13 తేదీలలో ఇంధన ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో గత 23 రోజుల్లో 19 సార్లు డీజిల్ ధరపై మొత్తంగా రూ .5.95 పెరిగింది.
డీజిల్ ధరల పెంపుతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు రూ .100 కి పైగా చేరింది. అయితే కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా పెట్రోల్ రూ .100 దాటిన సంగతి మీకు తెలిసిందే.
సెప్టెంబర్ 5 నుండి పెట్రోల్ ధరలు స్థిరత్వాన్ని కొనసాగించాయి, అయితే చమురు కంపెనీలు చివరగా గత వారంలో ధరలను పెంచాయి. పెట్రోల్ ధరలు కూడా గత 19 రోజుల్లో 16 రోజులకు పెరిగింది దీంతో ధర లీటరుకు రూ. 4.65 పెరిగింది.
