Flipkart, Amazon sale: రేపటి నుంచే రిపబ్లిక్ డే సేల్.. ఆఫర్లు ఇవే..!
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా మరో సెల్కు (E-commerce sale 2022) సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక సేల్ (Repubukc day sale) నిర్వహించనున్నాయి.
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా మరో సెల్కు (E-commerce sale 2022) సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక సేల్ (Repubukc day sale) నిర్వహించనున్నాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణాలు సహా ఇతర అన్ని రకాల వస్తువులపైనా భారీ డిస్కాంట్లతో విక్రయించనున్నాయి. ఫ్లిప్కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' పేరుతో ఈ సేల్ (Flipkart Big Saving Days sale 2022) నిర్వహిస్తోంది. రేపటి నుంచి (జనవరి 17 సోమవారం) ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు సేల్ (Flipkart Republic Day Sale 2022) కొనసాగనుంది. అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్లకు మాత్రం ఈ ఆఫర్లు నేటి నుంచే అందుబాటులోకి వచ్చింది.
స్మార్ట్ఫోన్ బ్రాండ్లు.. యాపిల్, రియల్మీ, పోకో, షియోమీ, శాంసంగ్, ఒప్పొ, ఇన్ఫీనిక్స్ వంటి వాటిపై 40 శాతం వరకు డిస్కౌంట్ (Flipkart offers on Smartphones) ఇస్తోంది. శాంంసగ్, ఎల్జీ, సోనీ, షియోమీ, వన్ ప్లస్ సహా ఇతర బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై 25 శాతం డిస్కౌంట్లు ప్రకటించింది. ల్యాప్టాప్లపై 40 శాతం వరకు డిస్కౌట్లు ఇస్తోంది. గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈ స్పెషల్ సేల్లో ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ల ద్వారా లవాదేవీలు జరిపి వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ ఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి.. స్పెషల్ సేల్ ఆఫర్తో పాటు 5 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్.. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్ (Amazon Great Republic Day Sale 2022) నిర్వహిస్తోంది. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. అయితే ప్రైమ్ యూజర్లకు (Amazon Republic Day Sale 2022) మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 16) నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. యాక్సెసరిస్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని (Amazon offers on Smartphones) పేర్కొంది. ఇతర గాడ్జెట్స్, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటుల అందుబాటులో ఉంటాయని పేర్కొంది అమెజాన్ ఇండియా.
వన్ ప్లస్ 9 ప్రో 5జీ మొబైల్ ధరను దాదాపు రూ.9 వేల తగ్గింపుతో విక్రయించనుంది అమెజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ.64,999గా ఉండగా.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో భాగంగా 55,999గా నిర్ణయించింది. రెడ్మీ 32 అంగూళాల స్మార్ట్ టీవీ ధరను రూ.24,999 నుంచి రూ.13,499కి (Amazon offers on TVs) తగ్గించింది. ఎస్బీఐ కార్డ్ ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి ఆఫర్ ధరతో పాటు.. 10 శాతం తక్షణ (Amazon Bank offers) డిస్కౌంట్ లభించనుంది.