Asianet News TeluguAsianet News Telugu

10 వేల పెట్టుబడితో ప్రారంభమై, రూ. 2 లక్షల కోట్లకు ఎదిగిన సన్ ఫార్మా వ్యాపార సామ్రాజ్యం వెనుక ఎవరున్నారో తెలుసా

సన్ ఫార్మా కంపెనీ ద్వారా ఫార్మా ప్రపంచంలో సంచలనాలు  సృష్టించిన దిలీప్ సంఘ్వీ గురించి తెలుసుకుందాం. అతి తక్కువ పెట్టుబడితో కృషిని, పట్టుదలను నమ్మకొని నేడు ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా విజయం వెనుక దిలీప్ సంఘ్వీ పడిన శ్రమ తప్పకుండా కనిపిస్తుంది. 

Do you know who is behind the Sun Pharma business empire which has grown to 2 lakh crores MKA
Author
First Published Mar 17, 2023, 12:43 AM IST

ఓ సాధారణ గుజరాతీ కుటుంబంలో జన్మించిన దిలీప్ సంఘ్వీ తన డ్రగ్స్ డీలర్‌షిప్ వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. అలా వివిధ ఔషధాల గురించిన సమాచారం తెలుసుకున్నాడు. 1982లో 27 సంవత్సరాల వయస్సులో సంఘ్వీకి రూ. 10,000 పెట్టుబడితో గుజరాత్ లోని వాపిలో తమ మొదటి ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాడు. కంపెనీ పేరు సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్.

నేడు, సన్ ఫార్మా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,40,000 కోట్ల నికర విలువతో, దిలీప్ సంఘ్వీ భారతదేశంలోని ఏడవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దిలీప్ సంఘ్వీ, ఫోర్బ్స్ ప్రకారం,15.4 బిలియన్ డాలర్ల నికర విలువతో, భారతదేశపు ఏడవ ధనవంతుడుగానూ,  ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో సంఘ్వీ 109వ స్థానంలో ఉన్నారు. 

దిలీప్ సంఘ్వీ 1955లో గుజరాత్‌లోని అమ్రేలి అనే చిన్న గ్రామంలో జైన కుటుంబంలో జన్మించారు. శాంతిలాల్ సింఘ్వీ , కుముదా సింఘ్వీల కుమారుడు దిలీప్ సంఘ్వీ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో పట్టభద్రుడయ్యాడు. అతను జె.జె. అజ్మీరా హైస్కూల్, భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కళాశాల పూర్వ విద్యార్థి. 

1982లో వాపిలో 10,000. దిలీప్ సంఘ్వీ తన 27వ ఏట మూలధనంతో వాపిలో సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే దిలీప్ లాభాల రుచి చూశాడు. మొదటి సంవత్సరంలోనే 7 లక్షల లాభం చూశాడు. అతను తన సొంత కర్మాగారాన్ని కలిగి ఉండవలసిన అవసరాన్ని వెంటనే గ్రహించాడు. ఈ నేపథ్యంలో అప్పు తీసుకుని వాపిలో తయారీ యూనిట్ ప్రారంభించాడు. 1990లో ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్ రంగంలో తనదైన ముద్ర వేసింది. 

1993లో కంపెనీ మొత్తం రూ.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు పెట్టుబడి పెట్టారు. మరుసటి సంవత్సరం, ప్రజలకు షేర్లను విక్రయించడానికి స్టాక్ మార్కెట్ లో ఐపీవో ద్వారా ప్రవేశించారు. ఆ సమయంలో కంపెనీ టర్నోవర్ రూ.50 కోట్లు మాత్రమే నేడు.  నేడు రూ.15,000 కోట్లకు పెరిగింది. సంఘ్వీ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. సంఘ్వి సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కో ,CMD, శాంతిలాల్ సింఘ్వీ ఫౌండేషన్ అధిపతిగా ఉన్నారు. 

దిలీప్ సంఘ్వీ మే 2021లో స్పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. అయితే ఆయన డైరెక్టర్‌గా, చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దిలీప్ సంఘ్వి తన 21వ ఏట విభా సంఘ్విని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు అలోక్ మరియు ఒక కుమార్తె విధి ఉన్నారు. వీరిద్దరూ సన్ ఫార్మాస్యూటికల్స్‌లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios