అమెజాన్, ప్లిఫ్కార్ట్లకు షాక్: ఆఫర్లు నిషేధించాలని సియాట్ అప్పీల్
ఈ కామర్స్ దిగ్గజాలకు షాకిచ్చేలా ఇండియన్ ట్రేడర్ బాడీ- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది.
ముంబై: ఒకవైపు రానున్న పండుగల సందర్భంగా అమెజాన్, ప్లిప్కార్ట్ రిటైల్ ఆన్ లైన్ దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలకు షాకిచ్చేలా ఇండియన్ ట్రేడర్ బాడీ- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది.
రానున్న పండుగల సందర్భంగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివ్ సేల్స్ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఏఐటీ విజ్ఞప్తి చేసింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను అతిక్రమిస్తున్నాయని పేర్కొంది.
ఈ మేరకు వాణిజ్య మంత్రికి శుక్రవారం ఒక లేఖ రాసింది. రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ నిర్వహిచే ఫెస్టివల్ సేల్ను నిషేధించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని సియాట్ కోరింది. ఇవి ప్రకటిస్తున్న భారీ ఆఫర్లు సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. 10-80 శాతం దాకా భారీ తగ్గింపులను అందించి, ఈ కంపెనీలు ధరలను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయన్నది.
కాగా ఈ పండుగ సీజన్లో వాల్మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుసగా ఆరు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ అందిస్తోంది. అమెజాన్ కూడా తేదీలు ప్రకటించాల్సి ఉంది.