సైరస్ మిస్త్రీకి నివాళులర్పించిన అమూల్.. "హి స్టీల్ హ్యాడ్ మైల్స్ టు గో" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్..
డైరీ బ్రాండ్ అమూల్ మోనోక్రోమ్ డూడుల్తో సైరస్ మిస్త్రీకి నివాళులర్పించింది. సెప్టెంబర్ 4 ఆదివారం రోజున సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
సెప్టెంబర్ 4న అంటే గత ఆదివారం ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి డెయిరీ బ్రాండ్ అమూల్ మోనోక్రోమ్ డూడుల్తో వ్యాపారవేత్తకు నివాళులర్పించింది.
సైరస్ మిస్త్రీ యానిమేటెడ్ వెర్షన్ ఉన్న డూడుల్ను అమూల్ ఫోటో అండ్ వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫార్మ్ ఇన్స్ట గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్టులో "హి స్టీల్ హ్యాడ్ మైల్స్ టు గో. సైరస్ మిస్త్రీ 1968-2022” అని డూడుల్పై రాసి ఉంది.
"డైనమిక్ బిజినెస్ మ్యాన్ కి నివాళి" అనే క్యాప్షన్తో ఈ పోస్ట్ షేర్ చేసింది. అయితే సైరస్ మిస్త్రీ మృతి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అగ్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అతని మృతి సంతాపం తెలిపారు.
సైరస్ మిస్త్రీ మరో ముగ్గురు అనహిత పండోల్, డారియస్ పండోల్, జహంగీర్ పండోల్ కలిసి ముంబైకి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యారు. అనాహిత్ పండోల్, ఆమె భర్త డారియస్ ప్రమాదం నుండి బయటపడగా సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే మరణించారు.