విపణిలోకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కేఎస్
సౌకర్యవంతమైన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ‘బుల్లెట్ 350 కేఎస్’ విపణిలోకి అడుగు పెట్టింది.
న్యూఢిల్లీ: సౌకర్యవంతమైన డిజైన్, మెరుపు వేగానికి పెట్టింది పేరు రాయల్ ఎన్ఫీల్డ్. బైక్ల గురించి ఆలోచించగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఈ ద్విచక్రవాహనమే. దాంట్లో బుల్లెట్ మోడల్కి ఉండే క్రేజే వేరు. భారత విపణిలో అత్యంత విజయవంతమైన బైక్లలో ఇదొకటి.
తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కేఎస్(కిక్ స్టార్ట్)ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది మొత్తం మూడు రంగులు.. బుల్లెట్ సిల్వర్, సఫైర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్తోపాటు లెజెండరీ బ్లాక్ పెయింట్ కలర్లో అందుబాటులోకి రానుంది. దీని ధరను రూ.1.12 లక్షలుగా నిర్ణయించారు.
హ్యాండ్ పెయింటెడ్ ఫ్యుయల్ ట్యాంక్, పిన్స్ట్రిప్స్, లెయిడ్ బేర్ ఇంజిన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్, ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్, 346 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 19.8బీహెచ్పీ, 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ కాన్స్టంట్ మెష్ ట్రాన్స్మిషన్ ఇంజిన్లో కలిగి ఉన్నాయి.
సింగిల్ ఛానల్ యాంటీ బ్రేకింగ్ సిస్టం పొందుపరిచారు. రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ కేంద్రాల్లో ఈ బైక్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ. 5000 చెల్లింపుతో బైక్ని బుక్ చేసుకోవచ్చు. సింగిల్ చానెల్ ఏబీఎస్.. ఫ్రంట్ 280 ఎంఎం, 153 ఎంఎం డ్రమ్స్ తో కూడిన 19 అంగుళాల టైర్లు అమర్చారు.