సారాంశం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా ఓలా ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుకుంటోంది.

బెంగళూరు, జూలై 4, 2023: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ EV 2W విభాగంలో తన నాయకత్వాన్ని కొనసాగించింది. జూన్ నెలలో 40% మార్కెట్ వాటాతో తన ప్రథమస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. సబ్సిడీ తగ్గింపు కారణంగా మొత్తం పరిశ్రమ అమ్మకాలు క్షీణించినప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ జూన్‌లో దాదాపు 18,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి (వాహన్ డేటా ప్రకారం), భారతదేశ EV 2W రంగంలో అగ్రగామిగా నిలిచింది.

ఓలా  చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “ఓలా అత్యధిక మార్కెట్ వాటాను నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది. జూన్ నెల పరిశ్రమకి మందకొడిగా ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన అమ్మకాలను కొనసాగించింది. మా ప్రభావవంతమైన వ్యయ నిర్మాణాలు, బలమైన సప్లై చైన్స్ ఇంకా పటిష్టమైన ఇన్-హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్  వంటివి సబ్సిడీ తగ్గింపు ప్రభావాన్ని చాలా వరకు గ్రహించేలా చేశాయి, తద్వారా ఇది మా ఉత్పత్తి ధరలను అత్యంత పోటీతత్వంతో అలాగే అందుబాటులో ఉంచుతుంది. ఈ జూలైలో S1 ఎయిర్‌తో మా రాబోయే పోర్ట్‌ఫోలియో విస్తరణ గురించి మేము సంతోషిస్తున్నాము, ఇది EVలను మరింత అందుబాటులోకి తెస్తుంది."

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా ఓలా ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుకుంటోంది. కంపెనీ ఇటీవలే తన 750వ ECని ప్రారంభించింది ఇంకా   ఆగస్టు నాటికి 1,000కి మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఈ కేంద్రాలు 20 కిలోమీటర్ల పరిధిలో 90% ఓలా కస్టమర్‌లను కలిగి ఉండడం ద్వారా వారికి అనేక రకాల సేవలను సులభంగా అందిస్తాయి.

నేడు ఓలా S1 దేశంలోని 2W విభాగంలో అత్యంత బలవంతపు EV ప్రతిపాదన. సవరించిన సబ్సిడీలు జూన్ నుండి అమలులోకి రావడంతో, ఇప్పుడు Ola S1 Pro ₹1,39,999 కి, S1 (3KWh) ₹1,29,999 కి, S1 Air (3KWh) ₹1,09,999 కి అందుబాటులో ఉన్నాయి.