ఓలా స్కూటర్ యూజర్లకు ఆ కంపెనీ సీఈవో భవిశ్ అగర్వాల్ శుభవార్త చెప్పారు. గత ఆర్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్కి సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్ఓఎస్2 అప్డేట్ అన్లాక్ అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ పాటకు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అయ్యింది.
సంగీతం ఇచ్చే కిక్కు ఇంకేదీ ఇవ్వదు ఈ ప్రపంచంలో. అందుకే దానికి కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నది ఉండదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో.. ఇంకెప్పుడు స్టార్లుగా మారుతారో చెప్పలేం. సామాన్యులు డ్యాన్సు చేస్తే ఎవరూ పట్టించుకోరు. అదే సెలబ్రిటీలు, సిఈవోలు ఐకాన్స్ చేస్తే వెంటనే హాట్ టాపిక్ గా మారిపోతుంది. తాజాగా ఓలా కంపెనీ సిఈవో భవిష్ అగర్వాల్ వైరల్ గా మారారు.<!--
Add Asianetnews Telugu as a Preferred Source

Scroll to load tweet…
