నవ గ్రహ దోషాన్ని తొలగించే పండ్లు ఇవి..!
పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా శరీరానికి పోషకాలను అందిస్తాయనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా, ఈ పండ్లు మన అదృష్టాన్ని కూడా మేల్కొల్పుతాయని మీకు తెలుసా?
చాలా మందికి జాతకాల్లో దోషాలు ఉంటాయి. నవ గ్రహాల్లోని ఏదో ఒక గ్రహ దోషం ఉండేవారు చాలా మందే ఉన్నారు. అయితే.. నవగ్రహ దోషాలను తగ్గించడానికి పండ్ల రసాన్ని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, గ్రహ భయాన్ని తగ్గిస్తుంది.
పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా శరీరానికి పోషకాలను అందిస్తాయనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా, ఈ పండ్లు మన అదృష్టాన్ని కూడా మేల్కొల్పుతాయని మీకు తెలుసా? అవును, పండ్ల రసాన్ని ఉపయోగించడం జ్యోతిష్య శాస్త్రానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గ్రహాల వల్ల వచ్చే అరిష్ట ప్రభావాలు తగ్గుతాయి. ఏ పండుతో ఏ గ్రహ దోషం తగ్గుతుందో తెలుసుకుందాం.
సూర్యుడు
దయగల పాలకుడు, సమర్థవంతమైన పాలకుడు, కీర్తి, అదృష్టాన్ని చెప్పేవాడు. సూర్యుని అరిష్ట ప్రభావం తగ్గాలంటే ఎర్రటి పండ్లు తినడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంటే.. బీట్రూట్, దానిమ్మ, టొమాటో, మామిడికాయ రసాన్ని సేవించాలి.
చంద్రుడు
చంద్రుడు సౌమ్యత , నీటికి సంకేతం. చంద్రుని బలం పెరగాలంటే లిచీ, పుచ్చకాయ, చెరుకు రసం తాగాలి. ఇలా చేయడం వల్ల చంద్ర గ్రహణ దోషం తగ్గి.. మీకు మంచి జరుగుతుంది.
కుజుడు..
జాతకంలో కుజ దోషం ఉన్న వ్యక్తి క్రూరంగా, హింసాత్వకంగా ఉంటారు.అటువంటి పరిస్థితిలో, అతనికి రక్త సమస్యలు ఉన్నాయి. మీరు దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాలనుకుంటే, ఆహారాలలో ఎక్కువ ఎరుపు వస్తువులను ఉపయోగించండి. ఉదాహరణకు, దానిమ్మ, టొమాటో, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ , బీట్రూట్ జ్యూస్ని ఉపయోగించవచ్చు.
బుధుడు
బుధ గ్రహం అభ్యాసం, తెలివితేటలు ,వృత్తికి సంబంధించినదని నమ్ముతారు. ఈ దోషం ఉన్నవారు.. ఆకు పచ్చని పండ్లు తీసుకోవాలి. గ్రీన్ అత్యంత ప్రభావవంతమైన రంగుగా పరిగణించబడుతుంది. జాతకంలో బుధ దోషం ఉన్నట్లయితే జామపండ్లను తీసుకోవాలి.
గురుడు..
జాతకంలో గురు దోషం ఉన్నవారు బలహీనంగా ఉంటారు. వారికి విద్య, సపంద మార్గలో అడ్డంకులు నెలకొంటాయి. ప్రతి విషయం జీవితంలో ఆటంకం కలిగిస్తూనే ఉంటుంది.ఈ గురు దోషం ఉన్నవారు అరటి, బొప్పాయి, నారింజ వంటి పండ్లను తీసుకోవాలి.
శుక్రుడు ప్రేమ, అందం, ఆకర్షనీయత ప్రభావాలను తగ్గించడానికి మూలంగా పరిగణిస్తారు. ఆ శుక్ర గ్రహ దోషం ఉన్నవారు..దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, లీచీ , పుచ్చకాయ రసం తీసుకోవడం మంచిది.
శనిగ్రహం ద్రోషం ఉన్నవారి జాతకం అస్సలు బాగోదు. వారి జీవితం నాశనం అయ్యినట్లుగానే ఉంటుంది. ఈ దోష ప్రభావం తగ్గించుకోవాలంటే.. ఈ శని గ్రహానికి నలుపు రంగు అంటే ఇష్టం. కాబట్టి.. ఆ రంగు పండ్లను ఎంచుకోవాలి. శని గ్రహ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి నల్ల ద్రాక్ష, ఊదా, బ్లాక్బెర్రీస్తో సహా నల్ల పండ్ల రసాన్ని త్రాగవచ్చు. ఈ ఫలాలు రాహు-కేతువుల ప్రభావానికి కూడా మేలు చేస్తాయి.