Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు... వైసీపీ నేత

ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య... చంద్రబాబుపై మండిపడ్డారు. 

ycp leader c ramachandraiah fire on chandrababu
Author
Hyderabad, First Published May 21, 2019, 1:04 PM IST

ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య... చంద్రబాబుపై మండిపడ్డారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు

రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోరపించారు. జాతీయ నేతలు పిలవకున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం లేదంటున్నారని ఆరోపించారు. 

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటన్నారు. విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని, ఎంత తిరిగిన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios