Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కొత్త డ్రామా..అప్రమత్తంగా ఉండాలి .. విజయసాయి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మరికాసేపట్లో చంద్రబాబు కొత్త డ్రామాకి తెరలేపుతాడని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

vijasai reddy satirical tweets on chandrababu, pawan
Author
Hyderabad, First Published Apr 10, 2019, 12:23 PM IST


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మరికాసేపట్లో చంద్రబాబు కొత్త డ్రామాకి తెరలేపుతాడని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. చంద్రబాబుతోపాటు పవన్, పాల్ లపై కూడా విజయసాయి విమర్శలు కురిపించారు.

‘‘చంద్రబాబు కొద్ది సేపట్లో కొత్త డ్రామా మొదలు పెడుతున్నాడు. తన చెంచాలైన పోలీసు అధికారులను ఎలక్షన్ కమిషన్ విధులనుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేక ఆందోళనకు చేస్తాడట. విజయవాడ అంబేద్కర్ కూడలిలో ఇసికి, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాకు కూర్చుంటాడట. సింపతీ కోసం కుట్రలకు తెరలేపాడు’’ అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో..‘‘జగనన్న సైనికులు, వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరులు ఇంకో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి. గుంట నక్క చంద్రబాబు డబ్బులు వెదజల్లి కొనుగోళ్లకు తెరలేపాడు. డబ్బు పంపిణీని అడ్డుకోవడంతో పాటు వాహనాల రాకపోకలపైనా కన్నేయాలి. నారాసురుడి పీడను విరగడ చేసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.

‘‘కొందరు బందిపోట్లు ఖజానా దోచుకుని అడవిలో పాతిపెట్టారట. మ్యాపులో గుర్తులను గీసి తలా ఒక ముక్క తీసుకుని విడిపోయారట.దాచిన సొత్తు కోసం ఒకరికి తెలియకుండా ఇంకొకరు వెతుకుతున్నారు. చివరికి ప్రజల చేతికి చిక్కారు. ప్యాకేజి పార్టనర్, పావలా పాల్,కాంగ్రెస్, కులమీడియానే ఈ బందిపోట్లు.’’ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. 

‘‘జనసేన, పాల్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరికి ఓటేసినా చంద్రబాబుకు వేసినట్టే. ఈ పార్టీ ల క్యాండిడేట్ల లిస్టు ఆయనే ఫైనల్ చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఆయన పంపిన నిధులతోనే ప్రచారం చేస్తున్నారు. ప్రజలంతా జగన్ వైపే ఉన్నా చతుర్ముఖ పోటీ ఉండేలా స్కెచ్ వేశాడు గుంట నక్క’’ అంటూ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios