టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్: అభ్యర్థుల జాబితాకు ఆమోదం
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం నాడు సాయంత్రం అమరావతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపనున్నారు.
అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం నాడు సాయంత్రం అమరావతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపనున్నారు.
ఇవాళ రాత్రికి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి ఈ దఫా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులను కూడ ఆహ్వానించారు.అభ్యర్థుల జాబితా విషయమై మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.