రాజకీయాల్లో ఆమెది గెస్ట్ రోల్: షర్మిలపై సీఎం రమేశ్ ఫైర్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి, వైఎస్ షర్మిలపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఫైరయ్యారు. రాజకీయాలలో షర్మిలది గెస్ట్ రోల్ అని సమస్యలు తెలుసుకోవాలంటే.. నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన సూచించారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి, వైఎస్ షర్మిలపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఫైరయ్యారు. రాజకీయాలలో షర్మిలది గెస్ట్ రోల్ అని సమస్యలు తెలుసుకోవాలంటే.. నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన సూచించారు.
చంద్రబాబు. లోకేశ్లను విమర్శించే స్థాయి షర్మిలకు లేదని ....ఆమెపై విమర్శలు చేసి తమ స్థాయి తగ్గించుకోదలచుకోలేదని రమేశ్ స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబ చరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు.
ముందు ఎలా మాట్లాడాలో షర్మిల తెలుసుకోవాలని.. గెస్ట్గా వచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం అవివేకమని, వైసీపీ వస్తే రాక్షస రాజ్యం వస్తుందని అందరికీ భయమని సీఎం రమేశ్ ఎద్దేవా చేశారు.