వరుసగా ఐదోసారి ఓడిపోయిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకాని గోవర్థన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసి మంత్రి సోమిరెడ్డిని ఓడించారు. ఇకపోతే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమిపాలవ్వడం ఇది ఐదోసారి.
నెల్లూరు: ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు వరుసగా నాలుగుసార్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకాని గోవర్థన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసి మంత్రి సోమిరెడ్డిని ఓడించారు. ఇకపోతే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమిపాలవ్వడం ఇది ఐదోసారి.
నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లా నుంచి పోటీ చేసిన ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఇద్దరూ ఓటమిబాట పట్టడం గమనార్హం.