Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుపై కేసులు నమోదు

ఏపీ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

police case against minister achennaidu and mp ram mohan naidu
Author
Hyderabad, First Published Mar 13, 2019, 12:02 PM IST

ఏపీ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 

ఈ ర్యాలీలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు కూడా పాల్గొన్నారు. కాగా... ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడుతో పాటు 50 మందిపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios