Asianet News TeluguAsianet News Telugu

తరిమి తరిమి కొడతా: వైసీపీ అభ్యర్థిపై పవన్ సంచలన వ్యాఖ్యలు

కురుసాల కన్నబాబు కాకినాడలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకువస్తే తరిమి తరిమి కొడతానని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి చెంచావైన నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. కురసాల కన్నబాబును కాకినాడ రూరల్ నుంచి తరిమికొట్టాలంటే పంతం నానాజీని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.

pawan kalyan sensational comments on ysrcp candidate kurasala kannababu
Author
Kakinada, First Published Apr 8, 2019, 5:57 PM IST


కాకినాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తరిమితరిమి కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కురసాల కన్నబాబు ఓ చెంచా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తినడానికి పనికిరాని చెంచా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి కురసాల కన్నబాబు అంటే ఎంతో ఇష్టమని అందుకే ఆయన్ను చేరదీశారని తెలిపారు. ఆ గట్టున తిని మరో పంచకు వెళ్తావా అంటూ దుమ్మెత్తిపోశారు. 

కురుసాల కన్నబాబు కాకినాడలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకువస్తే తరిమి తరిమి కొడతానని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి చెంచావైన నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. 

కురసాల కన్నబాబును కాకినాడ రూరల్ నుంచి తరిమికొట్టాలంటే పంతం నానాజీని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. మా అన్నయ్య చేరదీసిన మీరు వైసీపీ పక్కన చేరుస్తారా మీ వల్లే రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయన్నారు. అందువల్లే చిరంజీవి చెంచా కురసాల కన్నబాబును గెంటేశారని తెలిపారు.    

కన్నబాబు గెట్ అవుట్ కాకినాడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెట్ అవుట్ కాకినాడ అంటూ నినదించారు. జనసేన పార్టీని గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఫ్యాక్షన్ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దోపిడీ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపాలని జనసేనను అధికారంలోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios