మంగళగిరిలో టీడీపీ అభ్యర్ధి లోకేష్ ముందంజ
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజ ఉన్నారు.
గుంటూరు: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానంలో నారా లోకేష్ పోటీ చేశారు. చంద్రబాబునాయుడు కేబినెట్లో లోకేష్ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతున్నారు.
తొలిసారిగా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.