Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు సీఎం కావాలని రాయపాటి యాగాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి.  కాగా... ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ.... నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. 

mp rayapati conduct yagam for chandrababu to become CM Again
Author
Hyderabad, First Published May 10, 2019, 10:34 AM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి.  కాగా... ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ.... నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. 

ఈ మేరకు మొర్జంపాడు శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువాం శత చండీయాగం, మహాసుదర్శన యాగాలు నిర్వహించారు. చల్లా శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు. గురువారం ప్రారంభమైన ఈ యాగం ఐదువ రోజైన పూర్ణాహుతితో సమాప్తి అవుతుందని శ్రీనివాసశర్మ తెలిపారు.

 ఈ సందర్భంగా ఎంపీ రాయపాటి మాట్లాడుతూ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో నిర్మితమైన శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామీ ఆలయం శ్రీశైల దేవస్థానంతో సమానమైన ప్రాశస్థ్యం పొందిందని వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios