మోదీ ఓ కాలకేయుడు..? లోకేష్ సెటైర్ల వర్షం
ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్ల వర్షం కురిపించారు.
ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్ల వర్షం కురిపించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మోదీ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు లోకేష్ తనదైన శైలిలో ట్వీట్ల రూపంలో సమాధనం ఇచ్చారు.
‘‘ఏపీకి ప్రత్యేకహోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడు @narendramodi గారూ! కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి @ncbn గారు’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కిమోదీ ఈజ్ ఏ మిస్టేక్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
‘‘ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబున్నారు.హెరిటేజ్ సంస్థని చూసుకోవడానికి బ్రాహ్మణి, భువనేశ్వరిగారు ఉన్నారు.జగన్ అక్రమాస్తుల హెరిటేజ్ కి మోడీ గారు చౌకీదార్గా మారారు.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘54 వేల కోట్లయ్యే #పోలవరం ప్రాజెక్ట్కి 6 వేలకోట్లిచ్చి పూర్తిచేయలేదంటున్నారు. మీకు లెక్కలు రావా? ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కే లేదా?
గుజరాత్లో నరమేథం సాగించిన నరేంద్ర మోడీ గారూ! అరివీర భయంకరులైన మీరు భళ్లాల దేవుడికి సరిసాటి. కాలకేయుడికి మీరే పోటీ!’’ అని మోదీపై లోకేష్ సెటైర్లు వేశారు.