Asianet News TeluguAsianet News Telugu

శత్రువులకు సాయం చేసే గుణం వైఎస్ ది.. మంచు విష్ణు కామెంట్స్

శత్రువులకు కూడా సాయం చేసే గుణం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని నటుడు మంచు విష్ణు అన్నారు. 

manchu vishnu fire on chandrababu
Author
Hyderabad, First Published Apr 3, 2019, 12:01 PM IST

శత్రువులకు కూడా సాయం చేసే గుణం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని నటుడు మంచు విష్ణు అన్నారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీలో రచ్చబండ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబానికి రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. 27ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వం నుంచి రావా ల్సిన రూ.19కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించకుండా, ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పనిచేసినా నియోజకవర్గానికి, ప్రాంతానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

శ్రీవిద్యానికేతన్‌ను నెలకొల్పి చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల మందికి మోహన్‌బాబు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంతమందికి ఉపాధి కల్పిం చారో ఆలోచించాలని సూచించారు. వైఎస్‌ హయాంలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే ఆయన తనయుడు జగన్ ని గెలిపించాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios