Asianet News TeluguAsianet News Telugu

వంగవీటి రంగాను చంపింది దేవినేని నెహ్రూ, చంద్రబాబు మైండ్ బ్లాంక్: కొడాలి నాని ఫైర్

 నిరహారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను, ఆయన అనుచరులను చంపిన ఘనుడు దేవినేని నెహ్రూ అని గుర్తు చేశారు. నెహ్రూ తనయుడే దేవినేని అవినాష్ అని అలాంటి వ్యక్తికి ఓటేస్తారా అంటూ నిలదీశారు. గుడివాడలో ఎవరు అడుగుపెట్టినా ఎగిరేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాయేనని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. 

kodali nani sensational comments on chandrababu
Author
Gudivada, First Published Apr 2, 2019, 6:07 PM IST

గుడివాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని తీవ్ర నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలన అంతా దుర్మార్గమేనంటూ విరుచుకుపడ్డారు. అలాంటి పాలనకు చరమగీతం పాడాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన అందిన కాడికి దోచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు మైండ్‌ పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. 

గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడకు ఏమీ చేయని తీరా ఎన్నికలు వచ్చేసరికి అబద్దపు హామీలు ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌ హయాంలో చేపట్టిన పనులను సైతం ప్రారంభించలేకపోయిన దద్దమ్మ చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. 

గుడివాడ గడ్డపై తనను ఓడించే దమ్ము లే​క విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకొచ్చి తనపై పోటీకి నిలబెట్టారన్నారు. నిరహారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను, ఆయన అనుచరులను చంపిన ఘనుడు దేవినేని నెహ్రూ అని గుర్తు చేశారు. నెహ్రూ తనయుడే దేవినేని అవినాష్ అని అలాంటి వ్యక్తికి ఓటేస్తారా అంటూ నిలదీశారు. 

గుడివాడలో ఎవరు అడుగుపెట్టినా ఎగిరేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాయేనని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కొడాలి నాని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios