Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ కండువాతో జూ.ఎన్టీఆర్ : నలుగురిపై కేసు నమోదు

కట్టె కాలేవరకు తాను టీడీపీని వదిలేది లేదని పదేపదే ఎన్టీఆర్ చెప్తున్నప్పటికీ ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ప్రచారం చేస్తుండటంతో ఆయన అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు గుడిసె పరంధామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

jr.ntr photo morphing incident,four members against case filed
Author
Jaggayyapet, First Published Apr 4, 2019, 7:34 AM IST

జగ్గయ్యపేట: ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ వైసీపీ కండువా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కట్టె కాలేవరకు తాను టీడీపీని వదిలేది లేదని పదేపదే ఎన్టీఆర్ చెప్తున్నప్పటికీ ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ప్రచారం చేస్తుండటంతో ఆయన అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

దీంతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు గుడిసె పరంధామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ  కండువాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీంతో రంగంలోకి దిగిన ఎస్సై జె.శ్రీహరి  ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌ పెట్టిన గుండా శ్రీధర్‌, రామకృష్ణ, ఎన్‌.సాయి, జి.వెంకటేశ్వర్లు తదితరులపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిని విచారిస్తున్నామని ఎస్సై జె.శ్రీహరి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios