వైసీపీదే అధికారం : సినీగేయ రచయిత జొన్నవిత్తుల జోస్యం
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం దుర్మార్గమన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు.
తిరుపతి: రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జోస్యం చెప్పారు. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీని ఢీకొట్టిన బలమైన నాయకుడు వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు.
తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం దుర్మార్గమన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. తెలుగు భాషా అభివృద్ధి చెందాలంటే భూమన కరుణాకర్ రెడ్డి తప్పకుండా గెలవాలన్నారు. వైఎస్ జగన్ కి, భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించాలనే ఉద్దేశంతో తాను తిరుపతి వచ్చినట్లు తెలిపారు.
భాష విషయంలో రాష్ట్రం బలహీనపడిపోయిందన్నారు. తెలుగుదేశం కాస్త తెలుగులేశంగా మారిందని తెలిపారు. టీడీపీ పాలనలో ఇసుక, మట్టి మాఫియా స్మృతిమించిపోయాయని ఆరోపించారు. తనలాంటి రచయితలకు, భక్తులకు మంచి నాయకుడు కావాలని అది వైఎస్ జగన్ తోనే సాధ్యమన్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వారి సొంత భాషను అభివృద్ధి చేసుకుంటుంటే ఏపీలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయ పుష్కరిణిలో చేపల పెంపకం దారుణమని జొన్న విత్తుల రామలింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.