తుది జాబితా విడుదల చేసిన జనసేన: అభ్యర్థులు వీరే
నామినేషన్ల దాఖలకు చివరి రోజున జనసేన 19 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఉదయం జనసేన పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది.
హైదరాబాద్: నామినేషన్ల దాఖలకు చివరి రోజున జనసేన 19 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఉదయం జనసేన పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు వీరే
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
ఆలూరు- ఎస్ వెంకప్ప
నర్సీపట్నం- వేగి దివాకర్
నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతి నగరం- రాజీవ్ కుమార్ తలచుట్ల
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్ గౌతమ్
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి
పత్తికొండ- కెఎల్ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు- ఎన్.దయారామ్
కుప్పం- డాక్టర్ వెంకటరమణ
ఎంపీ స్థానాలకు అభ్యర్థులు
విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట- నయూబ్ కమాల్
హిందూపూర్- కరీముల్లా ఖాన్
విజయవాడ ఎంపీ స్థానానికి ముత్తంశెట్టి సుధాకర్ను అభ్యర్ధిగా ప్రకటించడంపై సీపీఐ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలుత ఈ సీటును సీపీఐకీ కేటాయించారు. మరోవైపు ఇదే స్థానంలో అభ్యర్ధిని నిలపడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వైపు నూజీవీడు స్థానంలో కూడ ఇదే తరహలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపడంపై సీపీఐ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.