స్టార్ హోదాను మరిచి సామాన్యుడిలా పవన్ కల్యాణ్...మట్టిగిన్నెలో భోజనం (వీడియో)
జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి తన సింప్లీసిటీని చాటుకున్నారు. స్టార్ హోదాను మరిచి అతి సామాన్యుడిలా తాటాకు చాపపై కూర్చుని భోజనం చేశారు. ఈ అరుదైన సన్నివేశం కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా ఆవిష్కృతమైంది.
జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి తన సింప్లీసిటీని చాటుకున్నారు. స్టార్ హోదాను మరిచి అతి సామాన్యుడిలా తాటాకు చాపపై కూర్చుని భోజనం చేశారు. ఈ అరుదైన సన్నివేశం కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా ఆవిష్కృతమైంది.
కృష్ణా జిల్లాలలో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ అలసిపోయిన పవన్ కల్యాణ్ కాస్సేపు సేదతీరడానికి మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద ఓ చెట్టు కిందకు చేరారు. అక్కడ ఓ తాటాకు చాపను కింద పర్చుకుని కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడే అతి సామాన్యుడి మాదిరిగా, పల్లెటూళ్లలో నిరుపేదలు తినే ఆహారాన్ని ఓ మట్టికుండలో తీసుకున్నారు. జొన్నఅన్నం, మజ్జిగలో కలుపుకొని పచ్చిమిరపకాయ పచ్చడితో నంజుకొని తిన్నారు.
భోజనం అనంతరం అదేమ వేపచెట్టు కింద తాటాకు చాపలపైనే సేదతీరారు. ఈ పల్లెటూరి వాతావరణం ఎంతో ఆహ్లాదం కలిగించడంతో ఇక్కడ ఇలా సామాన్యుడిలా మారిపోయినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
వీడియో
"