Asianet News TeluguAsianet News Telugu

ఎబీఎన్ ఎండీ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎబీఎన్ ఛానెల్ ఎండీ    వి. రాధాకృష్ణపై జూబ్లీహిల్స్ పోలిసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.
 

Hyderabad: YSRC MP Vijaya Sai Reddy lodges plaint against ABN
Author
Hyderabad, First Published Apr 8, 2019, 10:55 AM IST


హైదరాబాద్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎబీఎన్ ఛానెల్ ఎండీ    వి. రాధాకృష్ణపై జూబ్లీహిల్స్ పోలిసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.

ఏబీఎన్ ఛానెల్‌లో తన ఆడియో టేపు అంటూ నకిలీ ఆడియో టేపును ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో తన వాయిస్ అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు.

ఈ కథనంలో తాను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ప్రసారం చేశారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మాదిరిగా ఆత్మగౌరవం, కమిట్‌మెంట్ ఏపీ ప్రజలకు లేదని ఆ ఆడియో సంభాషణలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఉంది.

ఏబీఎన్ ప్రసారం చేసిన కథనంపై విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ కె. బాలకృష్ణరెడ్డి చెప్పారు. ఈ విషయమై కేసు నమోదుకు ముందు న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోనున్నట్టుగా  ఆయన ప్రకటించారు.

ఈ కథనం ప్రసారం చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్ర ఉందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  ఆరోపించారు. ఐపీసీ 153 ఏ తో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ప్రజాప్రాతినిథ్య చట్టం 125 కింద కేసు నమోదు చేయాలని  విజయసాయిరెడ్డి కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios