Asianet News TeluguAsianet News Telugu

రేపే ఫలితాలు... జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంపు

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం దేశ వ్యాప్తంగా జరగనుంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. 

high security in front of chandrababu and jagan houses
Author
Hyderabad, First Published May 22, 2019, 10:39 AM IST


సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం దేశ వ్యాప్తంగా జరగనుంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ నివాసాల వద్ద పోలీసులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

రేపటి ఫలితాలలో టీడీపీ, వైసీపీ తరపున ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు ఆయా పార్టీల అధినేతల ఇళ్లకు, కార్యాలయాలకు తమ అనుచరులతో కలిసి అధినేతల ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది.  దీంతో... చంద్రబాబు, జగన్ ఇళ్ల వద్ద  భద్రతను రెట్టింపు  చేశారు.

చంద్రబాబు, జగన్ నివాసాలు, పార్టీ కార్యాలయాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోనే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రెండేసి కంపెనీల బలగాలు పహారా కాస్తాయి. స్థానిక పోలీసులు సైతం 50 మంది చొప్పున భద్రతా విదుల్లో ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios