Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి జనసేన నష్టమే ఎక్కువ: హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు

పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన వల్ల టీడీపీకి కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.

former minister harirama jogaiah sensational comments on tdp
Author
Amaravathi, First Published Apr 17, 2019, 10:46 AM IST

పాలకొల్లు:  పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన వల్ల టీడీపీకి కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు-కుంకుమ పథకం వల్ల  తమకు మహిళల ఓటింగ్ భారీగా వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులుతీరి ఉండడాన్ని కూడ ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.

అయితే పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన పార్టీ చీల్చే ఓట్లు టీడీపీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.  ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడ 90 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు రావని ఆయన స్పష్టం చేశారు. 

వైసీపీ కూడ గత ఎన్నికల కంటే ఈ ఐదేళ్లలో గత ఎన్నికల కంటే కొత్త వర్గాలను ఆకర్షించలేకపోయిందని ఆయన తెలిపారు. బీఎస్పీ జనసేనతో పొత్తు పెట్టుకొన్న కారణంగా దళితుల ఓట్లలో చీలిక వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం వైసీపీకి నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios