Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు.

election commission issues notification for parliament, assembly elections
Author
Amaravathi, First Published Mar 18, 2019, 10:26 AM IST


హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థులు ఇవాళ్టి నుండి నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.

ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది.ఈ నెల 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.  ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios