Asianet News TeluguAsianet News Telugu

అందుకే నేను మౌనంగా ఉన్నా..లేదంటే : కొడాలి నానిపై దేవినేని అవినాష్

గుడివాడలో ఓడిపోతామన్న భయం కొడాలి నానికి పట్టుకుందన్నారు. ఓటమి భయంతో కొడాలి నాని వాధి రౌడీలను మించిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవినేని అవినాష్ టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. 

devineni avinash slams ys sharmila
Author
Gudivada, First Published Apr 3, 2019, 4:56 PM IST

గుడివాడ: రాబోయే ఎన్నికల్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. గుడివాడలో ఓడిపోతామన్న భయం కొడాలి నానికి పట్టుకుందన్నారు. 

ఓటమి భయంతో కొడాలి నాని వాధి రౌడీలను మించిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవినేని అవినాష్ టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. 

అందువల్లే తాము మౌనంగా ఉండాల్సి వస్తుందన్నారు. ఓటమి భయంతోనే అరాచకాలు సృష్టించేలా నాని విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు వైఎస్ జగన్, షర్మిలపై కూడా సెటైర్లు వేశారు దేవినేని అవినాష్. 

ఓడిపోతారన్న భయం వైఎస్ జగన్ లో స్పష్టంగా కనబడుతోందన్నారు. వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా 40 ఏళ్లు అనుభవం ఉన్నసీఎం చంద్రబాబుని  విమర్శించడం దారుణమన్నారు. 

చెప్పుకునేందకు ఏమీ లేకనే చంద్రబాబుపై జగన్, షర్మిలలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్, షర్మిల చేస్తున్న విమర్శలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios