Asianet News TeluguAsianet News Telugu

జేసీ దివాకర్ రెడ్డి కి క్లీన్ చిట్

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ... జేసీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

clean chit to tdp Leader JC diwakar reddy over election code
Author
Hyderabad, First Published May 19, 2019, 1:47 PM IST

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ... జేసీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వ్యయంపై జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జేసీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆర్వోని ఆదేశించారు. విచారణ జరిపిన ఆర్వో జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన లేదని తేల్చింది. జేసీ దివాకర్ రెడ్డి కి క్లీన్ చిట్ ఇచ్చేసింది.

ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, అన్ని పార్టీలు రూ. 10వేల కోట్లు ఖర్చు చేశాయని, పోటీలు పడి పార్టీలు ఖర్చు పెట్టాయని, మొదట్లో పోటీకి రూ. లక్ష, రెండోసారి రూ. 25 లక్షలు, ఇప్పుడు రూ. 25 కోట్లు లేకుంటే పోటీ చేసే పరిస్థితి లేదని జేసీ వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని ఆరోపించారు. 

దీనిపై జేసీ వివరణ కూడా ఇచ్చారు.  ఈ ఎన్నికల్లో తాను రూ. 50 కోట్లు ఖర్చు చేశానని ఎక్కడా చెప్పలేదని నివేదిక ఇచ్చారు. ఇతరులను ఉద్దేశించి సార్వత్రిక వ్యాఖ్య మాత్రమేనని స్పష్టీకరించారు. అయితే జేసీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఎవరి పేరు నేరుగా ప్రస్తావించలేదని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పరిధిలోకి రాదని ఆర్వో తన నివేదికలో స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios