Asianet News TeluguAsianet News Telugu

రేపు తిరుపతి నుండి బాబు ఎన్నికల ప్రచారం

రేపు ఉదయం తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 

chandrababunaidu to start election campaign from tirupati
Author
Tirupati, First Published Mar 15, 2019, 12:17 PM IST

అమరావతి: రేపు ఉదయం తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు తిరుపతికి చేరుకొంటారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొంటారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

తిరుపతిలో సేవా మిత్ర, బూత్ కమిటీ సభ్యులతో చంద్రబాబునాయుడు పాల్గొంటారు. శ్రీవారి దర్శనం తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత  చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సభలో పాల్గొంటారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సభ తర్వాత తొలి రోజు ఎన్నికల ప్రచారం పూర్తి కానుంది. ఈ నెల 17వ తేదీన విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో  చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

ఈ నెల18వ తేదీన నెల్లూరు, గుంటూరు, ప్రకాశం , కృష్ణా జిల్లాల్లో ఎన్నికల సభల్లో బాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19వ తేదీన కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో ఎన్నికల సభల్లో బాబు పాల్గొంటారు.ఆయా జిల్లాల్లోని ఎన్నికల సభలు పూర్తి చేసిన బస్సు యాత్ర చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios