Asianet News TeluguAsianet News Telugu

అత్తారింటికి పవన్ ఒక్కరే వెళ్లారు, కుటుంబ పెద్దగా..: చంద్రబాబు వ్యాఖ్యలు

అత్తారింటికి పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్లారంటూ సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలుగుదేశం ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ పెద్దగా నా ఆడబిడ్డలను గౌరవంగా అత్తారింటికి పంపుతానని స్పష్టం చేశారు. 

chandrababu naidu interesting comments on pawan kalyan
Author
Nellore, First Published Apr 2, 2019, 8:11 PM IST

నెల్లూరు:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్తారింటికి పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్లారంటూ సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలుగుదేశం ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. 

కుటుంబ పెద్దగా నా ఆడబిడ్డలను గౌరవంగా అత్తారింటికి పంపుతానని స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ తీసుకొచ్చామని తెలిపారు. 4, 5వ విడతల రుణమాఫీ డబ్బులు ఎన్నికలకు ముందే ఇస్తామని హామీ ఇచ్చారు. 

రూ.24,500 కోట్లు రైతు రుణ మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. రైతు రుణమాఫీ, పసుపు-కుంకుమ చెక్కులు చెల్లవంటున్న వైసీపీ నేతలే చెల్లని కాసులంటూ విమర్శించారు. ఏప్రిల్ 5న పసుపు కుంకుమ డబ్బు ఇస్తానని అది తన ఆడబిడ్డలు తీసుకోవాలని సూచించారు. 

మనల్ని మోసం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారని ఆరోపించారు. మోదీ ఏపీలో నాటకాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రన్న అండగా ఉంటామని నా చెల్లెమ్మలు తన వెనుక వస్తున్నారని తెలిపారు. ఊర్లకు ఊర్లు కదిలివస్తున్నాయన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్‌ రూ.వెయ్యి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రూ.2 వేలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కోడి కత్తి పార్టీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం తెలుసు తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం తెలియదన్నారు. కోడి కత్తి పార్టీకి దొంగ లెక్కలు, కుట్రలు, కుతంత్రాలు బాగా తెలుసునని ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. 

Follow Us:
Download App:
  • android
  • ios