అభిమానులపై బాలయ్య దాడి... భార్య వసుంధర కామెంట్స్
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా అభిమానులపై చెయ్యి చేసుకున్నారనే వార్తలు తరచూ వస్తుంటాయి.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా అభిమానులపై చెయ్యి చేసుకున్నారనే వార్తలు తరచూ వస్తుంటాయి. ఇప్పటికే పలుమార్లు బాలయ్య ఇలాంటి వివాదంలో ఇరుక్కోగా.. తాజాగా ఓ వీడియో జర్నలిస్టుని తిట్టం, ఓ అభిమానిని వెంబడించి మరీ కొట్టడం లాటి సంఘటనలు తీవ్ర దుమారం రేపాయి. బాలయ్య తీరు మార్చుకోకుంటే కష్టం అనే అభిప్రాయం వ్యక్తమౌతున్నాయి. కాగా.. ఈ ఘటనలపై బాలయ్య సతీమణి వసుంధర తాజాగా స్పందించారు.
బాలయ్య అభిమానులతో చాలా చనువుగా ఉంటారని వసుంధర చెప్పారు. ఫ్యాన్స్ను మనవాళ్లే అనుకునే మనస్తత్వం బాలయ్యది అని చెప్పుకొచ్చారు. .. బాలయ్య ఓ దెబ్బ కొట్టినా అభిమానులు కూడా ఏమీ అనుకోరన్నారు. అభిమానులకు బాలయ్య అంటే ఇష్టమని.. అందుకే వారు సంతోషంగానే ఉంటారన్నారు. కొందరు గిట్టనివాళ్లు బాలయ్య వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హిందూపురం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. పేదలకు అండగా ఉండే మనస్తత్వం బాలయ్యదని చెప్పారు. బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్గా బాలయ్య.. పేద, మధ్యతరగతి ప్రజలు.. ఇలా ఎవరొచ్చినా వైద్యం అందిస్తున్నారని.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు వచ్చినా.. రాకపోయినా అందరికి చికిత్స అందేలా చొరవ తీసుకుంటారని వసుంధర చెప్పారు.