అద్వానీ అన్న మాటలు మోడీ గురించే: చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్కె. అద్వానీ తన బ్లాగ్లో రాసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మోడీని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్కె. అద్వానీ తన బ్లాగ్లో రాసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మోడీని విమర్శించారు.
అద్వానీ అన్న మాటలు మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉందని.. తన స్వార్థం కోసం సొంత పార్టీని, దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి మోడీ వచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేయడమే కాకుండా కుట్రలతో మనపై దాడులు చేస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి చేతుల్లో దేశం ఉందని, జాతీయవాదం అంటే దేశద్రోహం ముద్రవేయడం కాదని మోడీకి చురకలు అంటించారు.
రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారు అన్న మాటలు నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో మన పై దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, తన స్వార్ధం కోసం తన పార్టీని దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోంది.
— N Chandrababu Naidu (@ncbn) April 4, 2019
"దేశమే ముందు. ఆ తర్వాతే పార్టీ. ఆ తర్వాతే వ్యక్తి. వాక్ స్వాతంత్ర్యం, వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలు. గతం నుంచి నేర్చుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూడాలి."
— N Chandrababu Naidu (@ncbn) April 4, 2019
ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అదే విషయాన్ని అద్వానీ గారు సున్నితంగా చెప్పారు.
— N Chandrababu Naidu (@ncbn) April 4, 2019