ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో  లగడపాటి రాజగోపాల్ మినహా మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడ వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ప్రకటించాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ మినహా మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడ వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ప్రకటించాయి. లగడపాటి సర్వేతో పాటు ఐఎన్ఎస్ఎస్, ఐలైట్ సంస్థలు కూడ టీడీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ఉంటాయని ప్రకటించాయి.. మిగిలిన సంస్థల సర్వే పలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇతర సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాల్లో టీడీపీకి... వైసీపీకి మధ్య సీట్ల సంఖ్య చాలా తేడా ఉన్నట్టుగా ప్రకటించాయి. ఈ సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ ఫలితాలు ఏ మేరకు వాస్తవం కానున్నాయో ఈ నెల 23వ తేదీన తేలిపోతాయి.


లగడపాటి సర్వే ఫలితాలు

టీడీపి-100
వైసీపీకి- 72
ఇతరులకు -3

మిషన్ చాణక్య

టీడీపీకి 55 -60
వైసీపీ 91 -105
ఇతరులు 5-9

పీపుల్స్ పల్స్


 వైసీపీ - 112
టీడీపీ- 59
జనసేన- 4

ఆరా
వైసీపీ -120
టీడీపీ -50
జనసేన -0

వీడీపీ అసోసియేట్స్

టీడీపీ 54-60
వైసీపీ 111-121
జనసేన 4

ఐఎన్ఎస్ఎస్ సర్వే

టీడీపీ -118
వైసీపీ- 52
జనసేన -5

ఐలైట్ సర్వే 
టీడీపీ 106- (5 పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)
వైసీపీ 68 -(5పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)
జనసేన -1