ఓటమిభయంతో డిప్రెషన్ లో రోజా : దివ్యవాణి
నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తన ఓటమిని ముందే గ్రహించిన రోజా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ డిప్రెషన్ వల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపోతే వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎలాంటి స్వార్థంతో ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు.
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. అన్యాయాలకు, అక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటూ విరుచుకుపడ్డారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన దివ్యవాణి నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి అనీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. వైసీపీ నాయకులు యువతను నేరగాళ్లుగా తయారు చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ విజయాన్ని వైసీపీ భరించలేకపోతుందన్నారు. అందుకే పసుపు-కుంకుమ చెక్కుల సొమ్మును బ్యాంకుల్లో వేయనీయకుండా కోర్టులో పిటీషన్ వేశారని దివ్యవాణి ఆరోపించారు.
మరోవైపు నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తన ఓటమిని ముందే గ్రహించిన రోజా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ డిప్రెషన్ వల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇకపోతే వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎలాంటి స్వార్థంతో ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. లక్ష్మీ పార్వతికి రాజకీయాలను ఏలాలనే ఆశ ఇంకా చావలేదన్నారు సినీనటి దివ్యవాణి.