Asianet News TeluguAsianet News Telugu

కులగజ్జిని కేసీఆర్ ఆసరాగా తీసుకుంటున్నారు... హీరో శివాజీ

ఏపీలో కులగజ్జి ఎక్కువగా ఉందని.. దానిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసరాగా తీసుకుంటున్నారని హీరో శివాజీ పేర్కొన్నారు.  సోమవారం శివాజీ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 

actor shivaji allegations on kcr, jagan, modi
Author
Hyderabad, First Published Apr 8, 2019, 11:51 AM IST

ఏపీలో కులగజ్జి ఎక్కువగా ఉందని.. దానిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసరాగా తీసుకుంటున్నారని హీరో శివాజీ పేర్కొన్నారు.  సోమవారం శివాజీ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తనకు చావంటే భయం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

వైఎస్ జగన్, సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై ఈ సందర్భంగా శివాజీ విమర్శల వర్షం కురిపించారు.  ఏపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కక్ష కట్టారని ఆరోపించారు. 

కేసీఆర్  ఇచ్చే డబ్బుల కోసం కొందరు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చే డబ్బులే ముఖ్యమనుకుంటే అమరావతి, పోలవరాన్ని కోల్పోతామన్నారు. పోర్టు కోసం కేసీఆర్ ఏపీలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్‌తో జగన్ జట్టుకట్టి హోదా సాధిస్తారా?.. ఇది నమ్మాలా? అని ప్రశ్నించారు.‘‘జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. జగన్ ఏ అర్హతతో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రాంతీయ పార్టీలను బీజేపీలో కలుపుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారు.’’ అని  వ్యాఖ్యానించారు.
 
మోదీ హయాంలో ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోయారని ఆయన మండిపడ్డారు. శాశ్వతంగా ప్రధానిగా ఉండాలని మోదీ కుతంత్రాలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో 150 మంది క్రిమినల్స్ పోటీ చేరస్తున్నారని తెలిపారు. జగన్ వస్తే మహిళలకు భద్రత ఉండదన్నారు. కేసీఆర్‌తో జగన్ జట్టుకడితే పోలవరం పూర్తవుతుందా? అని శివాజీ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబుతోను పోరాడా. ఇసుక ర్యాంపుల్లో అవినీతిని ప్రశ్నించా.’’ అని చెప్పారు. ఏ-1 జగన్, ఏ-2 విజయసాయిరెడ్డి ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. వైసీపీ గెలిచినా అమరావతిలో నిలబడి మాట్లాడతానని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios