గురువారం విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. 

గురువారం విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు.

ఉదయం 10 గంటలకు పవన్ ఇక్కడికి రావాల్సి ఉండగా.. గాజువాకలో మీటింగ్ అనంతరం 1.30కి బహిరంగసభ వద్దకు చేరుకున్నారు. జనసేనాని రాకతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గోలలు, కేకలతో మారుమోగింది.

ఆయనను చూసేందుకు యువత, మహిళలు ఎగబడటంతో తోపులాట జరిగింది. మైకులు పెట్టే బాక్స్‌పైకి ఎక్కి మరి పవన్‌ను చూసేందుకు చాలా మంది నిలబడ్డారు. అయితే బరువును ఆపుకోలేక ఆ స్టాండ్ కూలిపోయింది.

దీంతో దానిపై ఎక్కిన వారు కింద వున్న వారిపై పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, ఓ మీడియాకు సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్‌కు కాలు విరిగిపోయింది. దగ్గర్లో ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.