Asianet News TeluguAsianet News Telugu

జగన్ అహంకారం దిగాలంటే...: పవన్ కళ్యాణ్

జగన్‌ అహంకారం దిగాలంటే ఆ పార్టీ అభ్యర్ధులను ఓడించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.
 

pawan kalyan slams on ys jagan in tirupati meeting
Author
Tirupati, First Published Apr 4, 2019, 5:13 PM IST


తిరుపతి: జగన్‌ అహంకారం దిగాలంటే ఆ పార్టీ అభ్యర్ధులను ఓడించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.

గురువారం నాడు తిరుపతిలో జరిగిన జనసేన ఎన్నికల సభలో బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి జనసేన  చీఫ్ పాల్గొన్నారు.తిరుపతిలో అధికారులను వైసీపీ నేతలు చొక్కాలు పట్టుకొంటారని చెప్పారు. యూపీలో  వీధికో రౌడీని రుద్రకాళిలా మాయావతి  అణచివేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మెన్‌గా ఉన్న కాలంలో టీటీడీ నగలు ఏమాయ్యాయో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ తిరుమలలో ప్రోటోకాల్‌ను పాటించరని చెప్పారు. తానో మహత్ముడిగా జగన్ భావిస్తాడని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. 

కరుణాకర్ రెడ్డి తిరుమలేశ్వరుడికే విలువ ఇవ్వని వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శించారు.తిరుపతికి జగన్ చెప్పులు వేసుకొని వెళ్లిపోతాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కరుణాకర్ రెడ్డిని, వైసీపీ నేతలను ఓడించాలన్నారు. 

వైసీపీ నేతలకు ఊడిగం చేయనివ్వకపోతే బతకనివ్వరన్నారు. మేం కాన్షీరామ్ వారసులమని పవన్ చెప్పుకొచ్చారు.తిరుపతి సభ వేదికగా ప్రత్యేక హోదాను 10 ఏళ్ల పాటు ఇస్తామని మోడీ చెప్పారు. ప్రత్యేక హోదా అంశం మనగడలో ఉండేలా చేసింది జనసేన మాత్రమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఏపీ ప్రజలను బీజేపీ నేతలు అవమానించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ అవమానాలను ప్రజలు మర్చిపోలేరన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం  కేసీఆర్‌కు ఎందుకు ఇష్టం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్  ఏపీకి ఎలా మద్దతిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీఎస్పీ అండగా నిలుస్తోందని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios