సైకిల్ పాతపడిపోయింది... కేసీఆర్ సైకిల్‌ చైన్‌ను తెంచేశారని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  టీడీపీపై విరుచుకుపడ్డారు


మదనపల్లె: సైకిల్ పాతపడిపోయింది... కేసీఆర్ సైకిల్‌ చైన్‌ను తెంచేశారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీపై విరుచుకుపడ్డారు. రాజకీయాలు రెండు కుటుంబాలకేనా అని జగన్ , చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గురువారం నాడు చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వైసీపీని చూస్తే టీడీపీ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ అన్నారు.

తాను ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగా చెబుతానన్నాను. జగన్ మాదిరిగా వెళ్లి మోడీ కాళ్లు పట్టుకోనని ఆయన విమర్శించారు. శాసనసభకు వెళ్లని ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.