Asianet News TeluguAsianet News Telugu

వైసీపీకి 130 సీట్లు ఖాయం.. మోహన్ బాబు

ఈ ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా 130 సీట్లు గెలుచుకుంటుందని సినీనటుడు, వైసీపీ నేత మోహన్ బాబు జోస్యం చెప్పారు. మోహన్ బాబు సోమవారం చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

mohanbabu says, ycp gets 130seats in coming  assembly elections
Author
Hyderabad, First Published Apr 8, 2019, 2:54 PM IST

ఈ ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా 130 సీట్లు గెలుచుకుంటుందని సినీనటుడు, వైసీపీ నేత మోహన్ బాబు జోస్యం చెప్పారు. మోహన్ బాబు సోమవారం చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.

చంద్రబాబు ప్రజల డబ్బు అంతా దోచుకొని.. తన కొడుకు ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. తాను ఇప్పటి వరకు వైసీపీ తరపున 9 జిల్లాల్లో పర్యటించానని.. అందరి మద్దతు వైసీపీకే ఉందని మోహన్ బాబు అన్నారు. కచ్చితంగా 130 సీట్లు వైసీపీకి వస్తాయన్న విషయం తనకు అర్థమైందన్నారు.

కాబోయే సీఎం జగన్ అని.. ఆయన అధికారం చేపట్టగానే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.  చంద్రబాబు రోజుకో పార్టీతో సంసారం చేస్తారు. వెనువెంటనే విడాకులు ఇస్తారు. చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి రాత్రి రాత్రే తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు. ఆయనో అక్కుపక్షి. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఇందుకు పూర్తి భిన్నం. ఆయన జటాయువు లాంటివారు. తాను ప్రకటించిన మేనిఫెస్టోను వైఎస్ జగన్‌ తప్పకుండా అమలు చేస్తారు. అందుకు నేను హామీ ఇస్తున్నా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios