Asianet News TeluguAsianet News Telugu

మాగుంటపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సీబీఐ, ఈడీ దాడులు చేస్తోందని  మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉచ్చ పోసుకొన్నాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినా కూడ  శిద్దా రాఘువరావు పులిలా పోరాటంలోకి దిగాడని బాబు ప్రశంసలు కురిపించారు.

chandrababunaidu senational comments on magunta srinivasulu reddy
Author
Giddalur, First Published Apr 4, 2019, 4:31 PM IST


గిద్దలూరు: సీబీఐ, ఈడీ దాడులు చేస్తోందని  మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉచ్చ పోసుకొన్నాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినా కూడ  శిద్దా రాఘువరావు పులిలా పోరాటంలోకి దిగాడని బాబు ప్రశంసలు కురిపించారు.

గురువారం నాడు గిద్దలూరులో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో  చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొన్నటి వరకు మా పార్టీలోనే ఉన్నారు. అసలు పిరికివాడు, నా వద్దకు వచ్చి వణికిపోయాడని బాబు గుర్తు చేశారు. 

 మాగుంట శ్రీనివాసులు రెడ్డిది పెద్ద కుటుంబమని ఆయన చెప్పారు. దాడులు జరుగుతాయని చెప్పి వెళ్లిపోయాడన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మోసం చేసి వెళ్లిపోతున్నాడు...ఎంపీగా  పోటీ చేయాలని  తాను కోరగానే  క్షణం ఆలస్యం చేయకుండా సిద్దా రాఘవరావు పోటీ చేసేందుకు సిద్దమయ్యాడని బాబు చెప్పారు.

ఆర్యవైశ్య కులంలో పుట్టినా కూడ సిద్దా రాఘవరావు బుల్లెట్‌లా దూసుకుపోతున్నాడన్నారు. పులిలా గాండ్రిస్తున్నాడని బాబు సిద్దా రాఘవరావుపై ప్రశంసలు గుప్పించారు. ఇంత పిరికితనంతో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎందుకు పార్టీలో చేరారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకొన్నారో చెప్పాలన్నారు.

నీళ్లు కావాలా, కులం కావాలా తేల్చుకోవాలని చంద్రబాబునాయుడు కోరారు. అభివృద్ధి కావాలో, కులం కావాలో తేల్చుకోవాలని బాబు కోరారు. అభివృద్ధి కావాలో రౌడీయిజం కావాలో తేల్చుకోవాలో ఆయన ప్రజలను కోరారు. తనకు అండగా ఉంటే కొండనైనా ఢీ కొడతానని బాబు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios