‘‘పీక కోస్తా.. నా కొడకా’’.. మళ్లీ నోరుజారిన బాలయ్య (వీడియో)
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి నోరు జారారు. ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి నోరు జారారు. ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో మీకు మెజార్టీ పెరుగుతుంది సర్ అంటూ.. అభిమానులు ఆయనను ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తే... బాలయ్య మాత్రం తిట్టిపోసారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా.. ఈ క్రమంలో ఈ సారి ఎన్నికల్లో 60వేలు, 70వేలు మెజార్టీ రావడం పక్కా అంటూ అభిమానులు ఆయనతో అన్నారు. కాగా.. వారిచ్చిన పాజిటివ్ బూస్టప్ ను బాలయ్య నెగిటివ్ తీసుకోవడం గమనార్హం.
గెలవడమే కష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కార్యకర్త సర్ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు అడ్రస్ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
"