Asianet News TeluguAsianet News Telugu

బీకాంలో ఫిజిక్స్ చదవలేదు.. నటి మాధవీలత

సినీనటి, బీజేపీ గుంటూరు వెస్ట్ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాను ఈ ఎన్నికల్లో గెలిచినా,ఓడినా ప్రజలతోనే ఉంటానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

actress, bjp acndidate madhavi latha comments in election campaign
Author
Hyderabad, First Published Apr 4, 2019, 11:47 AM IST

సినీనటి, బీజేపీ గుంటూరు వెస్ట్ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాను ఈ ఎన్నికల్లో గెలిచినా,ఓడినా ప్రజలతోనే ఉంటానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా సమస్యలను అర్థంచేసుకునే మనసుంటే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదని ఆమె అన్నారు.

ఉన్నత చదువులు చదివిన తనకు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసు అని చెప్పారు. తాను ఇక్కడి నాయకుల్లాగా బీకాంలో ఫిజిక్స్ చదవుకులేదంటూ సెటైర్లు వేశారు. ప్రాంతీయ పార్టీల్లో ఉంటే.. ఒక్క పార్టీకే అంకితమౌతామని.. అందుకే తాను బీజేపీలాంటి జాతీయ పార్టీలో చేరానని ఆమె వివరించారు.

ఏపీలో నైతిక విలువలున్న ప్రాంతీయ పార్టీలేవీ తనకు కనిపించలేదని, తన కుటుంబానికి కూడా బీజేపీ చాలా దగ్గరైన పార్టీ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల కంటే గుంటూరు రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుందని, తనకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

తనకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. సినిమా వాళ్లందరూ మంచివారేనని, వారికి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం తప్ప దోచుకోవాలన్న ఆశ ఉండదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios