Asianet News TeluguAsianet News Telugu

తొలి గ్యారెంటీ ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. 'ఇందిరమ్మ అభయం' పేరుతో నెలకు ఎంతంటే..?

Indiramma Abhayam: ఏపీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో హస్తం పార్టీ తొలి గ్యారెంటీని ప్రకటించింది. తెలంగాణలో లాగానే.. ఏపీలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Ys Sharmila Announced Indiramma Abhayam Scheme At Congress Nyaya Sadhana Sabha In Anantapur KRJ
Author
First Published Feb 27, 2024, 1:47 AM IST

Indiramma Abhayam: ఏపీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొలి గ్యారెంటీని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ ‘న్యాయ సాధన సభ’లో  ఇందిమ్మ అభయం అనే మొదటి గ్యారెంటీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే  ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మహిళల పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని షర్మిల చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోడీ నిర్లక్ష్యం చేస్తున్నారనీ, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా (SCS) రూపంలో పూర్తి న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో పోరాడుతుందని ప్రతిజ్ఞ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధిని ఖర్గే గుర్తు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె షర్మిల నాయకత్వంలో ఈ ప్రగతిని పునరావృతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఉద్ఘాటించారు. షర్మిలకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా ఏకమై మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జేఎస్‌పీల మధ్య చాలా తేడా లేదని ఖర్గే ఆరోపించారు. మూడు పార్టీలు మోడీకి మద్దతుగా నిలిచాయని ఆరోపించారు. గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్‌ ను బిజెపి నిర్లక్ష్యం చేస్తుందని ఖర్గే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం SCS మంజూరు లేదా నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం వంటి వాగ్దానాలను నెరవేర్చలేదని, అయినప్పటికీ మూడు రాష్ట్ర స్థాయి పార్టీలు మోడీకి "వంగి దండాలు" పెడుతున్నాయని విమర్శించారు. ఆ పార్టీల ప్రవర్తనపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ఖర్గే ప్రజలను కోరారు. ఇందిరమ్మ అభయం పథకం యొక్క విశ్వసనీయతను ఆయన నొక్కిచెప్పారు, మోడీ చేసిన అమలుకాని వాగ్దానాలతో విభేదించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios