జగన్పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...
జైల్లో ఉన్న సమయంలో శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందనే విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లేఖను ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేయనున్నామని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.
హైదరాబాద్: జైల్లో ఉన్న సమయంలో శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందనే విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లేఖను ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేయనున్నామని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్పై గత ఏడాది అక్టోబర్ మాసంలో శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్పోర్టులో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి తర్వాత ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తైన తర్వాత విశాఖ జైల్లో శ్రీనివాసరావు రిమాండ్లో ఉన్నారు.
రిమాండ్లో ఉన్న సమయంలో శ్రీనివాసరావు 24 పేజీల లేఖను రాసుకొన్నారు. ఈ లేఖ కావాలని శ్రీనివాసరావు భావిస్తున్నారు. ఈ లేఖను చూసిన జైలు అధికారులు శ్రీనివాసరావును నుండి తీసుకొన్నారని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.
వైసీపీ మెనిఫెస్టో ఎలా ఉండాలనే విషయమై ఈ 24 పేజీల లేఖలో శ్రీనివాసరావు రాసుకొన్నారని సలీం చెప్పారు. ఏఏ అంశాలు మేనిఫెస్టోలో ఉండాలనే దానిపై ప్రధానంగా ప్రస్తావించినట్టు సలీం అభిప్రాయపడుతున్నారు.
విద్య, వైద్యం తో పాటు రైతాంగం సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉండాలనే అంశాలను శ్రీనివాసరావు ఈ లేఖలో ప్రస్తావించినట్టు చెబుతున్నారు. రైతులకు ఏ రకమైన కార్యక్రమాలు ఉండాలనే విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు.
సంబంధిత వార్తలు
కత్తిదాడి: జగన్కు ఎన్ఐఏ నోటీసులు
జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు
జగన్పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు
జగన్పై దాడి: గర్ల్ఫ్రెండ్స్ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...
జగన్పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ