Asianet News TeluguAsianet News Telugu

బహిర్భూమికి వెళ్లి.. చెరువులో మునిగి యువకుడి మృతి.. మట్టి తవ్వకాలే కారణమని, డెడ్ బాడీతో కుటుంబ సభ్యుల ఆందోళన

బహిర్భూమి కోసం చెరువు వద్దకు వెళ్లిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు నీటిలో మునిగి మరణించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో చోటు చేసుకుంది.

Went to the open air.. Youth drowned in the pond.. Excavation of soil is the cause, family members are worried about the dead body..ISR
Author
First Published Aug 28, 2023, 6:51 AM IST

బహిర్బూమికి అని వెళ్లి.. మట్టి తవ్వకాల వల్ల చెరువులో ఏర్పడిన భారీ గుంతల్లో పడి యువకుడు మరణించాడు. ఈ ఘటన  కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలే యువకుడి మరణానికి కారణమైందంటూ నిరసన చేపట్టారు.

BRS: బీఆర్ఎస్ కు త‌ల‌నొప్పిగా మారుతున్న సొంత నాయ‌కుల వ్యాఖ్య‌లు !

వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపర్తి గ్రామానికి చెందిన దళిత సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు (33) కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య నాగలక్ష్మి, పదో తరగతి చదివే కుమారుడు సురేష్, ఐదో తరగతి చదివే కూతురు ప్రియదర్శిని ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బారావు ఆదివారం సాయంత్రం బహిర్భుమికి వెళ్లాలనే ఉద్దేశంతో కోదండరామ చెరువు సమీపంలోకి వెళ్లాడు.

దొంగ‌త‌నం చేశార‌నే అనుమానంతో చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి న‌లుగురు దళితులపై దాడి

కొంత సమయం తరువాత కాలు జారి అతడు చెరువులో పడి పోయాడు. ఆ చెరువులో గతంలో మట్టి కోసం తవ్వకాలు జరపడం వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సుబ్బారావు నీటిలో మునిగిపోతుండగా పలువురు గమనించి చెరువు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నీటిలోకి దూకి సుబ్బారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు, అగ్నిమాక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, గత ఈతగాళ్లు కలిసి నీటిలో దిగి ఆ యువకుడి కోసం గాలించారు. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో డెడ్ బాడీని బయటకు తీసుకొని వచ్చారు. 

Rozgar Mela: కొత్తగా ఉద్యోగాల్లో చేరే 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించ‌నున్న ప్ర‌ధాని మోడీ

కాగా.. డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు దానికి అంగీకరించలేదు. అనంతరం తాటిపర్తి-వన్నెపూడి మెయిన్ రోడ్డుపై వారు డెడ్ బాడీతో గ్రామస్తులు నిరసన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సుబ్బారావు భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాగా.. ఈ నిరసనకు టీడీపీ, జనసేన నాయకులు మద్దతు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios